దుండిగల్/కుత్బుల్లాపూర్/జీడిమెట్ల/గాజులరామారం,ఫిబ్రవరి17: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ శ్రేణులు గురువారం సంబురాలు జరుపుకున్నారు. పలుచోట్ల కేక్లు కట్చేయగా, మరికొన్నిచోట్ల మొక్కలు నాటారు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ,ఎంఎల్ఆర్ఐటీఎం,ఐఏఆర్ఈ,ఎంఎల్ఆర్ఫార్మసీ కళాశాలల్లో కళాశాలల సెక్రటరీ,టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయాకళాశాలకు చెందిన అధ్యాపకులు,విద్యార్థులు స్వచ్ఛందంగా ముందు కొచ్చి రక్తదానం చేయడంతో 556 యూనిట్ల రక్తం సేకరించారు. రాజశేఖర్రెడ్డి స్వయంగా రక్తదానం చేశారు.