సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల మరణాలు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ హిందూస్థానీ సంగీతకారుడు జయరాజ్ నారాయణన్ దుర్మరణం చెందారు. అమెరికాలో చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించగా, ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని విషాదాన్ని మిగిల్చింది . జయరాజ్కు భార్య, మేఘన, గౌరీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శాస్త్రీయ,భక్తిగీతాలను పాడిన జయరాజ్ ప్రపంచ వేదికలపై భారతీయ సంగీత గొప్పదనాన్ని చాటి చెప్పారు. చిన్న వయస్సులోనే అనేక అవార్డులు సొంతం చేసుకున్న జయరాజ్ నారాయణన్ 14 సంవత్సరాల పాటు కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.