కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం విదితమే. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్కు మద్దతుగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ నేటి నుంచి ప్రచారం చేయనున్నారు. నిన్న రాత్రి ఆమె కోల్కతాకు చేరుకున్నారు. తృణమూల్ ఎమ్మెల్యే ఆరూప్ బిశ్వాస్కు మద్దతుగా జయా బచ్చన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆరూప్ బిశ్వాస్పై కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియో పోటీ చేస్తున్నారు.
తృణమూల్కు మద్దతుగా సమాజ్వాదీ పార్టీ ప్రచారం నిర్వహిస్తుందని గత నెలలో ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయా బచ్చన్ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ బెంగాల్ ప్రజలను అయోమయంలో పడేసి, క్రూరమైన రాజకీయ చర్యలకు పాల్పడుతుందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఇక మమతకు శివసేన, ఎన్సీపీ కూడా మద్దతు ప్రకటించింది. మమత నిజమైన బెంగాల్ పులి అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి..