అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న జవహర్రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సీఎస్గా పనిచేసిన డాక్టర్ సమీర్ శర్మ ఈరోజు (బుధవారం) పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జవహర్రెడ్డి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1990 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన జవహర్ రెడ్డి 2024 జూన్ వరకు పదవీలో కొనసాగనున్నారు. గతంలో జవహర్ రెడ్డి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు.