వివాహానంతరం కాస్త విరామాన్ని తీసుకున్న అగ్ర కథానాయిక నయనతార ప్రస్తుతం షూటింగ్స్తో బిజీగా ఉంది. ఆమె నటించనున్న 75వ సినిమాను ఇటీవల చెన్నైలో లాంఛనంగా ప్రారంభించారు. నెట్ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మిస్తున్నది. శంకర్ శిష్యుడు నిలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకు ‘లేడీ సూపర్స్టార్ 75’ అనే వర్కింగ్ టైటిల్ను పెట్టారు. దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి దక్షిణాది సూపర్స్టార్గా పేరు సంపాదించుకుంది నయనతార. కెరీర్లో మైలురాయి వంటి 75వ సినిమా విషయంలో నయనతార ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుందని, మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. జై, సత్యరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం నయనతార హిందీలో షారుఖ్ఖాన్ సరసన ‘జవాన్’, తెలుగులో ‘గాడ్ఫాదర్’, తమిళంలో ఇరైవన్, కనెక్ట్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.