10 రోజుల తర్వాత కూడా జాతి రత్నాలు దూకుడు తగ్గడం లేదు. ఈ వారం విడుదలైన సినిమాలకు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో జాతిరత్నాలకు కలెక్షన్స్ పెరుగుతూ పోతున్నాయి.
స్వప్న సినిమా బ్యానర్ పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి సెన్సేషనల్ కలెక్షన్స్ నమోదు చేస్తుంది.
కేవలం 11 కోట్లు లక్ష్యంతో బరిలోకి దిగిన జాతి రత్నాలు సినిమా ఇప్పటికే 31 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తాజాగా చిత్రం నుండి మేకింగ్ వీడియో విడుదల చేయగా, ఇది నెటిజన్స్ను ఆకట్టుకుంటుంది.