బ్యాంకాక్: రష్యా నుంచి తక్కువ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అంశంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. బ్యాంకాక్లో జరిగిన 9వ భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ మీటింగ్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును సమర్ధించుకున్నారు. ఇంధన, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అలాంటి సమయంలో రష్యా నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయడం తప్పుకాదన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం వల్ల చాలా వరకు కంపెనీలు తమ ఇంధనాన్ని యూరోప్ దేశాలకు సరఫరా చేస్తున్నాయని, ప్రస్తుతం రష్యా నుంచి యూరోప్ తక్కువ స్థాయిలో ఇంధనాన్ని తీసుకుంటోందని మంత్రి జైశంకర్ తెలిపారు.
ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయని, అలాగే గ్యాస్ ధరలు కూడా అసాధారణ రీతిలో పెరుగుతున్నాయని, ఆసియా దేశాలకు ఇంధన సరఫరా చేసే సాంప్రదాయ దేశాలన్నీ ఇప్పుడు యూరోప్కు తరలిస్తున్నాయని మంత్రి జైశంకర్ తెలిపారు. దేశ ప్రజల సంక్షేమం కోసమే ఉత్తమ డీల్ను కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. రక్షణాత్మక తీరులో భారత్ ఇంధనాన్ని కొనుగోలు చేయడంలేదన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో చాలా ఓపెన్గా ఉన్నామని, దేశంలో తలసరి ఆదాయం రెండు వేల డాలర్లు ఉందని, ఇలాంటి ప్రజలు ఇంధనం కోసం అధిక ధరలు వెచ్చించలేరని మంత్రి తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే ఇంధనాన్ని అందివ్వడమే తన విధి, బాధ్యతగా భావిస్తానన్నారు.