జగిత్యాల టౌన్/రాయికల్, నవంబర్ 2: అన్నదాతల ఆర్థికాభ్యున్నతికి కృషి చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు. మంగళవారం జగిత్యాల మండలం చల్గల్ వ్యవసాయ మార్కెట్, మోరపల్లి, రాయికల్ మండలం అయోధ్యలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 391, నియోజకవర్గంలో 141 ధాన్యం సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కొనుగోలులో జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సెంటర్లలో సకల సౌకర్యాలు కల్పించాలని, అవసరం మేరకు గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రం నల్లచట్టాలు చేసి రైతుల నడ్డివిరిచిందని విమర్శించారు. ఇందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా, రైతుబంధు, 24 గంటల కరెంట్ లాంటి పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నదని చెప్పారు. అనంతరం రాయికల్ మండలం కొత్తపేట్కు చెందిన మండ్ల నాగరాజు విద్యుత్ షాక్తో మృతి చెందగా బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షల చెక్కును అందించారు. ఏఎంసీ చైర్మన్ కొలుగూరి దామోదర్రావు, సర్పంచులు గంగ నర్సు, రాజన్న, సత్తమ్మ, గంగారాం, అర్బన్ జడ్పీటీసీ మహేశ్, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు బాలముకుందాం, నక్క రవీందర్రెడ్డి, జుంబర్తి శంకర్, టీఆర్ఎస్ అర్బన్ మండలా ధ్యక్షుడు సురేందర్రావు, ఏఎంసీ డైరెక్టర్లు బండారి విజయ్, బట్టు ప్రవీణ్, చెట్పల్లి మోహన్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాజేందర్ ఉన్నారు. రాయికల్ ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, ఏఎంసీ చైర్మన్ గన్నె రాజరెడ్డి, వైస్ చైర్మన్ కొల్లూరి వేణు, వైస్ ఎంపీపీ మహేశ్వరావు, సర్పంచులు ఎడ్మల జీవన్రెడ్డి, కైరి ముత్తన్న, బత్తిని రాజేశం, ఎంపీటీసీలు లక్ష్మి, దొంతి నాగరాజు, మందుల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు ముఖీద్ పాల్గొన్నారు.