Loksabha Elections 2024 : ఫకీరేశ్వర్ మఠాధిపతి జగద్గురు ఫకీర దింగలేశ్వర్ మహాస్వామి ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇవి కేవలం ఎన్నికలు కాదని ధర్మయుద్ధమని నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం ఆయన పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో తాను ఘనవిజయం సాధిస్తాననే విశ్వాసం ఉందని చెప్పారు. అవినీతి ప్రభుత్వం, అవినీతి నేతలపై సాగించే ధర్మయుద్ధం ఇదని ఆయన వ్యాఖ్యానించారు. దింగలేశ్వర్ మహాస్వామి ధార్వాడ్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్ధి ప్రహ్లాద్ జోషీపై పోటీ చేస్తున్నారు. ప్రహ్లాద్ జోషీ కేంద్రమంత్రి హోదాలో ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని ఆరోపించారు.
Read More :