అమరావతి : ఏపీలో ఎన్నికలు (AP Elections) రోజురోజుకు వేడెక్కుతుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. అధికార వైసీపీ, కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలకు చెందిన నాయకులు ప్రచారంలో పార్టీలు మారుతుండడంతో అన్ని పార్టీల నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది . తాజాగా రాజోల్(Rajole) , పి.గన్నవరం (P.Gannavaram) నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వర్రావు, మాజీ పీఏసీ చైర్మన్ వీరవెంకట సత్యనారాయణతో పాటు మరి కొంతమంది గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేశారు.