దుబాయ్: శ్రీలంక తొలి టెస్టులో బ్యాటింగ్తో విధ్వంసం.. బౌలింగ్తో నిప్పులు చెరిగిన భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (406) టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. బుధవారం విడుదలైన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో జడ్డూ నంబర్వన్ ర్యాంక్కు దూసుకెళ్లగా.. రవిచంద్రన్ అశ్విన్ (347) మూడో ర్యాంక్కు పడిపోయాడు. లంకతో మ్యాచ్లో అజేయ శతకం (175 నాటౌట్) బాదడంతోపాటు తొమ్మిది వికెట్లు పడగొట్టిన జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. గతం (2017)లో నంబర్వన్ ర్యాంక్లో ఉన్న ఈ స్టార్ ఆల్రౌండర్ మళ్లీ ఇన్నాళ్లకు టాప్ ర్యాంక్కు చేరుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో జడేజా (578)17 స్థానాలు మెరుగుపర్చుకుని 37వ ర్యాంక్లో నిలువగా, కోహ్లీ (763), రోహిత్శర్మ (761) వరుసగా ఐదు, ఆరో ర్యాంక్ల్లో ఉన్నారు.