న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశవ్యాప్తంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అసెస్మెంట్ ఏడాది 2021-22(2020-21 ఆర్థిక సంవత్సరం)కిగాను 6.17 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని, వీరిలో 19 లక్షల మంద ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్లను నూతన ఐటీ ఈ-ఫైలింగ్ పొర్టల్ కింద దాఖలు చేసినట్లు సీబీడీటీ తాజాగా వెల్లడించింది. వీరిలో 48 శాతం ఐటీఆర్-1(2.97 కోట్ల మంది), తొమ్మిది శాతం ఐటీఆర్-2(56 లక్షలు) 13 శాతం ఐటీఆర్-3(81.6 లక్షలు), 27 శాతం ఐటీఆర్-4(1.65 కోట్లు, ఐటీఆర్-5(10.9 లక్షలు), ఐటీఆర్-6(4.84 లక్షలు), ఐటీఆర్-7(1.32 లక్షలు) ఉన్నారు.