హైదరాబాద్ : నగరంలోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నది. ఏకకాలంలో నగరంలోని పలుచోట్ల అధికారులు సోదారులు జరుపుతున్నారు. ఫీనిక్స్ కార్యాలయంతో పాటు కంపెనీ, డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. మరో వైపు మదాపూర్లోని ఫీనిక్స్ ఐటీ సెజ్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తుండగా.. వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాలోనూ ఫీనిక్స్ పెట్టుబడులు పెట్టింది. ముంబై నుంచి వచ్చిన ఐటీ అధికారుల ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తున్నది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ దాడులు జరుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, 25 వాహనాల్లో.. దాదాపు 150 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తున్నది.