చెన్నై: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లల్లో ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో సుమారు 40 ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పది మంది తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఈ జాబితాలో ఉన్నారు. కలైపుతి థను, ఎస్ఆర్ ప్రభు, అన్బు చెచియాన్, జ్ఞానవేల్ రాజా ఇండ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలైందని అధికారులు తెలిపారు. అక్రమ ఆస్తుల్ని సీజ్ చేస్తున్నారు.