తిరుమల : తిరుమల (Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 60,517 మంది భక్తులు దర్శించుకోగా 27,788 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 3.53 కోట్లు వచ్చిందని వివరించారు.
కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
కడపలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Brahmotsam) భాగంగా నాలుగో రోజు శనివారం నవనీతకృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పె్క్టర్ నవీన్ పాల్గొన్నారు.