న్యూఢిల్లీ, మార్చి 23: పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీస్లపై బుధవారం ఉదయం ఒకేసారి దాడులు చేసినట్టు ఐటీ అధికారి ఒకరు తెలిపారు. హీరో గ్రూపు చైర్మన్, సీఈవో పవన్ ముంజల్కు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. కంపెనీకి సంబంధించిన పలు ఉన్నతాధికారుల గృహాలపై కూడా ఐటీ అధికారులు దాడుల చేసినట్లు తెలుస్తున్నది. ఈ దాడుల్లో కంపెనీ, కంపెనీ ప్రమోటర్లకు చెందిన ఆర్థిక లావాదేవీలు, ఇతర పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.