హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షలకు బుర్ఖా ధరించి వచ్చే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుర్ఖాలను తొలగించాలని కోరవద్దని సూచించింది. అయితే ఆ విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా మహిళా టీచర్ను ఏర్పాటు చేసి నిషేధిత వస్తువులు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్(సీఎస్డీవో) అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.