ధర్మపురి, డిసెంబర్ 29: ప్రముఖ పుణ్య క్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. సంస్కృతీ సంప్రదాయాలు, పరిశుభ్రత పాటిస్తున్న దేవాలయంగా కీర్తి గడించింది. ఐఎస్వో 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ ఉన్నందున ఢిల్లీకి చెందిన ఓటాబు సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ఆలయాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనితాగుప్తా పంపిన ఐఎస్వో గుర్తింపు సర్టిఫికెట్ను మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి ఆలయ ఈవో శ్రీనివాస్కు బుధవారం అందజేశారు.