కైరో: షూటింగ్ ప్రపంచకప్లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ‘హ్యాట్రిక్’ కొట్టింది. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో రజతం.. టీమ్ ఈవెంట్లో స్వర్ణం కొల్లగొట్టిన మన అమ్మాయి 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లోనూ పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇషా సింగ్, రాహి సర్ణోబత్, రిథిమ్ సాంగ్వాన్లతో కూడిన భారత జట్టు 17-13తో సింగపూర్ బృందంపై విజయం సాధించింది. ఆది నుంచి సింగపూర్ జోడీపై మన షూటర్లు పైచేయి కనబర్చారు. జూనియర్ స్థాయిలో నిలకడగా రాణించిన ఇషా సింగ్.. సీనియర్ స్థాయిలోనూ అదే జోరు కనబరుస్తున్నది. తొలిసారి బరిలోకి దిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లోనే మూడు పతకాలు కొల్లగొట్టి.. ఈ ఘనత సాధించిన తొలి షూటర్గా రికార్డుల్లోకెక్కింది. ఈ టోర్నీలో ప్రస్తతుం భారత్ 5 పతకాల (3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం)తో రెండో స్థానంలో కొనసాగుతున్నది.