తిరుమల : టీటీడీ ఈవో ( TTD EO )గా ముద్దాడ రవిచంద్ర ( Muddada Ravichandra) శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.ఇదివరకు ఉన్న అశోక్ సింఘాల్ను అక్కడి నుంచి బదిలీ చేయడంతో ఆయన స్థానంలో రవిచంద్రకు ఈవోగా స్థానం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీ పాలక మండలి సభ్య కార్యదర్శిగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

Ttd Eo Charge 1
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజులుగా తిరుమలలో చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
శ్రీవారి భక్తులకు సాటి భక్తుడిగా సేవ చేస్తానని చెప్పారు. భక్తుల నుండి చాలా సలహాలు సూచనలు వచ్చాయని, వాటిని తానే స్వయంగా పరిశీలించి ఆ అనుభవంతో భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు.