న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: వైవాహిక బంధానికి సంబంధించిన వివాదాల్లో పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరిదన్న అంశంపై పలు చట్టాలు ఉన్నాయని, వాటిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి సమగ్ర చట్టాన్ని ఎందుకు రూపొందించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలా చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సత్వర పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది.