లండన్, డిసెంబర్ 22: కోళ్ల పెంపకమే నేరమా? అని ఆ దంపతులు గుడ్లు తేలేశారు. అలెగ్జాండర్, లొరేన్ బర్గీన్ దంపతులు బ్రిటన్లోని బ్లాక్పూల్లో నివసిస్తున్నారు. ఎందుకైనా పడి ఉంటాయని కొన్ని కోళ్లు పెంచుకుంటున్నారు. కానీ రాత్రిపగలు అవి చేసే యాగీ చుట్టుపక్కలవారికి చిరాకు తెప్పించింది. వారు కోర్టుకు వెళ్లారు. ధ్వని కాలుష్య చట్టం కింద కోర్టు కోళ్లను పెంచుతూ న్యూసెన్స్ కలిగిస్తున్న దంపతులను తప్పు పట్టింది. తక్షణమే కోళ్లను అక్కడి నుంచి తరలించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద 100 పౌండ్ల (సుమారు రూ.10 వేలు) జరిమానా విధించింది. దాని మీద 22 పౌండ్ల (సుమారు రూ.2,200) సర్చార్జి కూడా వేసింది. .