కింగ్స్టన్: అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఐర్లాండ్.. విదేశీ గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఐర్లాండ్ 2-1తో చేజిక్కించుకుంది. సోమవారం జరిగిన చివరి వన్డేలో ఐర్లాండ్ 2 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 44.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. హోప్ (53), హోల్డర్ (44) రాణించారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్ 44.5 ఓవర్లలో 8 వికెట్లకు 214 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (44), మెక్ బ్రెయిన్ (59), టెక్టర్ (52) ఆకట్టుకున్నారు.