Spiritual Telangana | మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలోని (Telangana Tourism) అధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పిర్చ్యువల్ తెలంగాణ (Spiritual Telangana) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఉండగా.. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు.
స్పిర్చ్యువల్ తెలంగాణ (Spiritual Telangana) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. ఆగష్టు 12న ఈ ప్యాకేజీ (Tour Package)ని బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో యాదాద్రి (Yadadri), సురేంద్రపురి (Surendra Puri), చార్మినార్ (Charminar), సాలార్జంగ్ మ్యూజియం (Saalarjung museam), లుంబినీ పార్క్(lumbini park), బిర్లా మందిర్ (Birla Mandhir), గోల్కొండ కోట (Golconda Fort), స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ (Hyderabad Package) ప్రారంభం అవుతుండగా.. ఇది 2 రాత్రులు, 3 రోజులు కొనసాగుతుంది.
‘స్పిర్చ్యువల్ తెలంగాణ’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు హైదరాబాద్ (Hyderabad) లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లో ఐఆర్సీటీసీ పిక్ చేసుకుంటారు. హోటల్ చెకిన్ అనంతరం బ్రేక్ ఫాస్ట్ చేసి చార్మినార్ (Charminar), సాలార్జంగ్ మ్యూజియం (Saalarjung museam) సందర్శన ఉంటుంది. తర్వాత లుంబినీ పార్క్ (lumbini park) సందర్శించి హోటల్కి తిరిగి వెళతారు. రాత్రి భోజనం చేసిన తర్వాత హైదరాబాద్ లోనే బస ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి బిర్లా మందిర్ (Birla Mandhir)లోని శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం గోల్కొండ కోట (Golconda Fort), సందర్శన ఉంటుంది. తర్వాత ముచ్చింతల్లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శించి హోటల్కి తిరిగి వెళతారు. రాత్రి భోజనం చేసిన తర్వాత హైదరాబాద్ లోనే బస ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy Temple) ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత సురేంద్రపురి సందర్శన ఉంటుంది. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
‘స్పిర్చ్యువల్ తెలంగాణ’ ప్యాకేజీ ధర
Tour cost | ‘స్పిర్చ్యువల్ తెలంగాణ’ టూర్ ప్యాకేజీ ధర చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.22100, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11670, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 9020, చెల్లించాలి. 5 నుంచి 11 ఏండ్ల చిన్నారులకు రూ. 9020గా నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలో AC వసతి, హోటల్లో బస, బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి