న్యూఢిల్లీ: జనరల్ క్లాస్ ప్రయాణికులకు ఆహారం అందించేందుకు రైల్వే శాఖ ఇటీవల ఓ కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని కింద రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణించే ప్యాసెంజర్లు సరసమైన ధరల్లో పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ పొందగలరని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
మీల్ కౌంటర్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా జనరల్ కోచ్లు ఉండే ఫ్లాట్ఫాం ఏరియాలో ఉంటాయన్నారు. ఎకానమీ మీల్ రూ.20, స్నాక్ మీల్ రూ.50 అనే రెండు క్యాటగిరీలుగా ఉంటుందని, నేరుగా కౌంటర్ల వద్ద కొనుగోలు చేయవచ్చన్నారు.