హైదరాబాద్ : ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్(PBKS), చెన్నై సూపర్ కింగ్స్( CSK) జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల(Dharamsala) స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్( Punjab Kings)బౌలింగ్ను ఎంచుకుంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్ 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా, సీఎస్కే(Chennai Super Kings) 10 మ్యాచులు ఆడి ఐదు గెలిచి ఐదింటిలో ఓడిపోయి 10 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానున్నది.
పంజాబ్ తుది జట్టు : జానీ బెయిర్స్టో, రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్ (సి), జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్
చెన్నై తుది జట్టు : అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్పాండే