ఉత్తరకాశీ: ఉత్తరాకాండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగం(Uttarakhand Tunnel)లో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే టన్నెల్ ఆపరేషన్లో పాల్గొనేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ ఉత్తరాఖండ్కు వచ్చారు. సిల్కియారా టన్నెల్ వద్ద ఆయన ప్రత్యేకంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించనున్నట్లు ఆయన చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ బాగానే సాగుతోందని, మా బృందం మొత్తం ఇక్కడే ఉందని, సమస్యకు పరిష్కారాన్ని చూపనున్నట్లు చెప్పారు. ఇక్కడ చాలా పని జరుగుతోందని, చిక్కుకున్న కార్మికులే కాదు, రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నవాళ్లు కూడా సురక్షితంగా ఉండాలని అర్నాల్డ్ తెలిపారు. ఆహారం, వైద్యం క్రమంగా అందుతోందన్నారు.