భవన నిర్మాణ పనులు అభివృద్ధికి దిక్సూచీలు. ఇలాంటి పనుల్లో పాల్గొనే కార్మికులకు రక్షణగా నిలుస్తూ ఆ కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా ఇస్తోంది కార్మిక బీమా. ప్రాజెక్టులు, భవనాలు, రోడ్లలాంటి భారీ,మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమ ఏదైనా ఈ పనులు చేసే కార్మికులకు ఆపత్కాలంలో కార్మిక బీమా కొండంత అండగా నిలుస్తున్నది. గడువు తేదీ లేకుండా ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ బీమాకు దరఖాస్తు చేసుకోవాలని కార్మిక శాఖ సూచిస్తున్నది.
నాగర్కర్నూల్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎలాంటి వ్య య, ఆర్థిక, మానవ శ్రమ లేకుండా సంక్షేమ ప థకాలను నేరుగా ప్రభుత్వం అందజేస్తున్నది. అయితే అభివృద్ధి పనుల్లో పాల్గొనే కార్మికులకు మాత్రం బీమా పథకం నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నది. స్వరాష్ట్రంలో ప్రాజెక్టులు, రో డ్లు, భవనాల నిర్మాణాలు, కలెక్టరేట్లు, ఎస్పీ కా ర్యాలయాలు, ప్రభుత్వ భవనాల పనులు జరుగుతున్నాయి. రోడ్లు వేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, ఎంజీకేఎల్ఐతోపాటు భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, మిషన్ భగీరథ వంటి పలు నీటి ప్రాజెక్టుల పనులు అమలవుతున్నాయి. ఇందులో కార్మికుల పాత్ర ప్రధా నం. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన, అవయవాలకు నష్టం కలిగిన కార్మికులకు బీమా భరోసా కల్పిస్తున్నది. ఇంటి నుంచి పనికి వెళ్లిన కార్మికుడు రాత్రి ఇంటికి చేరుకునే క్రమంలో ఎ ప్పుడైనా ప్రమాదం కలిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో కార్మికులకు వివిధ రకాలుగా బీమా ద్వారా సాయం అందించేందుకు కార్మిక శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. సాధారణ సెలవు రోజుల్లో తప్పా ఎప్పుడైనా కార్మికులు బీమా కో సం దరఖాస్తులు చేసుకోవచ్చు. దీనికి ప్రాజెక్టు లు, భవనాలు, రోడ్ల నిర్మాణాలు చేపట్టే కార్మికులతోపాటు ఫ్లోరింగ్, మట్టిపని, రాడ్డు బెండిం గ్, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ప్లంబర్లు, తాపీ మేస్త్రీలు, ఫిట్టర్లు, జేసీబీ కార్మికులు, ఇటుక బట్టీ కూలీలు, క్వారీలు, తదితర పనులు చేపట్టే వారు అర్హులు. కార్మికుడిగా పేరు నమోదై ఉండి పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 6.30 లక్షలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.4 లక్షల బీమా అందుతుంది. సాధారణ మ రణానికి రూ.1.30 లక్షలు వస్తుంది. ఇక 50 శా తం అంగవైకల్యం కలిగితే రూ.4 లక్షల చొప్పు న పరిహారం అందుతుంది. దెబ్బలు తగిలి ద వాఖానలో చేరితే చికిత్సకు ఆర్థిక సాయం ఇ స్తారు. ఐదు రోజులు దాటితే రోజుకు రూ.100 చొప్పున మూడు నెలల వరకు రూ.1500 చొ ప్పున అందుతుంది. కాగా, పని ప్రదేశంలో చనిపోతే మృతదేహాన్ని ఇంటికి చేర్చేందుకు రూ.30 వేలు కూడా చెల్లిస్తారు. మహిళా కార్మికురాలు లేదా కార్మికుడి భార్యకు ప్రసూతి సాయంగా రూ.30వేలు ఇస్తారు. ఈ సాయం రెండు కాన్పులకు అందుతుంది. పెండ్లి కాని మహి ళా కార్మికురాలికి, కార్మికుడి ఇద్దరు కుమార్తెలకు ఆర్థిక సాయం కింద రూ.30వేలు ఇస్తారు. దీనికోసం కార్మికులు పెండ్లి, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఫొటో, వివాహ నమోదు పత్రాలు అందజేయాలి. కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకూ ఈ పథకం వర్తిస్తుంది. 18 నుంచి 60 ఏండ్లలోపు వయస్సున్న కార్మికులందరికీ బీమా పథకం వరంగా మారనున్నది. మీ సేవ కేంద్రా ల్లో దరఖాస్తు చేసుకోవాలి. కార్మిక శాఖతో ఉచితంగా లభించే దరఖాస్తును నింపి రూ.110 చెల్లించి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి బీమా చేయించుకుంటే ఐదేండ్లపాటు వర్తిస్తుం ది. దీనికోసం ప్రతినెలా రూ.1 చొప్పున సంవత్సరానికి రూ.12 చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలి. రెన్యూవల్ చేసుకోకుంటే ఈ పథకానికి అనర్హులు. నాగర్కర్నూల్ జిల్లాలో దాదాపుగా లక్ష మంది కార్మికులు ఉంటారని కార్మిక శాఖ చెబుతున్నది. ఇందులో 33 వేల మంది మాత్ర మే ఇప్పటి వరకు పేర్లు నమోదు చేయించుకున్నారు. మిగిలిన చాలా మంది బీమాపై అవగాహన లేక దూ రంగా ఉండిపోయారు. అయితే, కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఆ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆయా కార్మిక సంఘాలతో సమావేశాల నిర్వహణకు సమాయాత్తమవుతున్నారు.