మల్కాజిగిరి, నవంబర్ 12: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్లో 17 నుంచి మొబైల్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ కరోనా రాకుండా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంహెవో హెలన్ నిర్మల, ఎస్ఎస్ మనోహర్, ఏఈ వనజ, ఏఎస్ వీణ పాల్గొన్నారు.