ముంబై: భారత నావికా దళాన్ని మరింత శక్తివంతం చేయడానికి కీలక ముందడుగు పడింది. తీర ప్రాంత రక్షణే పరమావధిగా భారత తొలి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఆదివారం ముంబై సముద్ర తీరంలో విధుల్లోకి చేరింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ప్రత్యేకతలు
పొడవు: 163 మీటర్లు
వెడల్పు: 17.4 మీటర్లు
బరువు: 7,400 టన్నులు
వేగం: గంటకు 56 కిలోమీటర్లు
నిర్మాణం: మజగాన్ డాక్ లిమిటెడ్