మారుతీనగర్, అక్టోబర్ 2 : గాంధీ జయంతిని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అఖండ స్ఫూర్తి యజ్ఞంలో భాగం గా ప్రతి ఖాదీ కార్యకర్త పాల్గొని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు చరఖాతో నూలు వడికారు. తయారైన చిలుపలను గాంధీ చిత్రపటానికి, విగ్రహానికి వేసి నివాళులర్పించారు.