శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 83వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి 41,400 క్యుసెక్కులు, విద్యుదోత్పత్తి ద్వారా 33,114 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 8,622 క్యుసెక్కులు మొత్తం 83,136 క్యుసెక్కులు శ్రీశైలానికి విడుదల చేశారు. ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో 19,070 క్యూసెక్కులు వరద దిగువకు వెళ్తోంది.