జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్లోకి మంగళవారం వరద వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 17,320 క్యూసెక్కులు వస్తుండడంతో బ్యారేజీ 10 గేట్లు ఎత్తి 15,310 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఏఈ షేక్వలీ తెలిపారు. బరాజ్ పూర్తిస్థాయి నీటి మట్టం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.635 టీఎంసీలు నీరు ఉంది.