AP News : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిది ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదమని, ఆయన ఉన్మాదంతో రాజకీయాలు చేస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఆయన నోరు తెరిస్తే చంపేస్తాం, నరుకుతాం, అంతు చూస్తాం అంటున్నారని మండిపడ్డారు.
తాము అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతామని, పనులు ఆపేస్తామని జగన్ అంటున్నారని నిమ్మల మండిపడ్డారు. పరిటాల రవి నుంచి వివేకా హత్య వరకు సాక్షులు ఎలా చనిపోతున్నారని ప్రశ్నించారు. రంగా హత్యలో ప్రధాన నిందితుడి కుమారుడు ఎక్కడ ఉన్నారు..? అని అన్నారు. డ్రగ్స్తో యువతకు ఉపాధి కల్పించడమే జగన్ పాలసీ అని ఎద్దేవా చేశారు. గొడ్డలి పార్టీకి రాష్ట్రంలో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని అన్నారు.