మకాయ్ (ఆస్ట్రేలియా): మహిళల బిగ్బాష్ లీగ్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన సత్తాచాటింది. సిడ్నీ థండర్స్ తరఫున బరిలోకి దిగిన స్మృతి (45; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఆదివారం సిడ్నీ సిక్సర్స్తో జరిగిన మ్యాచ్లో మంధన జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. ఎలీసె పెర్రీ (40 నాటౌట్) టాప్ స్కోరర్.. కాగా, భారత యువ ఓపెనర్ షఫాలీ వర్మ (8) విఫలమైంది. అనంతరం ఛేదనలో స్మతి మంధన రాణించడంతో సిడ్నీ థండర్స్ జట్టు 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.