ముంబై: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయంలో మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం భారత జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించింది.
టీమ్ఇండియా వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్గా సీనియర్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ను ఎంపిక చేయగా.. పేసర్ భువనేశ్వర్ కుమార్ను వైస్-కెప్టెన్గా నియమించారు. వన్డే, టీ20 సిరీస్లకు ఒకే జట్టును సెలక్ట్ చేశారు. టూర్లో భాగంగా భారత్, లంక మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ సిరీస్ జూలై 13 నుంచి 25 వరకు జరగనుంది.
భారత వన్డే, టీ20 జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హర్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), యుజువేంద్ర చాహల్, కే గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వీ చక్రవర్తి, భువనేశ్వర్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా
🚨 NEWS 🚨: The All-India Senior Selection Committee picked the Indian squad for the 3-match ODI series & the 3-match T20I series against Sri Lanka in July. #TeamIndia
— BCCI (@BCCI) June 10, 2021
Details 👉 https://t.co/b8kffqa6DR pic.twitter.com/GPGKYLMpMS