మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్కు ముందు జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ముందంజ వేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బాంబ్రీ 6-4, 6-2తో డొమిగస్ (పోర్చుగల్)పై విజయం సాధించాడు. 68 నిమిషాల్లో ముగిసిన పోరులో బాంబ్రీ వరుస సెట్లలో విజృంభించాడు. మరో మ్యాచ్లో రామ్కుమార్ రామనాథన్ 3-6, 5-7తో మార్కొ మొరోనీ (ఇటలీ) చేతిలో ఓడగా.. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అంకితా రైనా పరాజయం పాలైంది.