హైదరాబాద్, నవంబర్ 21: నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్లో ఇండియన్ ఆయిల్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియన్ ఆయిల్ జట్టు 6-4తో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట్టుపై విజయం సాధించి పూల్ ‘ఏ’లో అగ్రస్థానాన నిలిచింది. సికింద్రాబాద్లోని ఎస్సీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇండియన్ ఆయిల్ జట్టు పెనాల్టీ కార్నర్ల ద్వారా నాలుగు గోల్స్ సాధించడం విశేషం. భారత ఆటగాడు రఘునాథ్ (19వ, 30వ, 54వ నిమిషాల్లో) మూడు గోల్స్ కొట్టి జట్టుకు విజయాన్నందించాడు.