న్యూఢిల్లీ: దేశీయ సంస్థలు నడుపుతున్న విమానాలు, విమానాశ్రయాల్లో భారతీయ సంగీతమే వినిపించాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్), సంగీతకారులు సూచిస్తున్నారు. ఈ చిన్న మార్పుతో దేశ ప్రజల మధ్య భావోద్వేగ బంధం బలపడుతుందని పేర్కొంటున్నారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు గురువారం ఐసీసీఆర్ ప్రెసిడెంట్ సహస్రబుద్ధే, పలువురు సంగీతకారులు వినతిపత్రం అందించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.