న్యూఢిల్లీ, మార్చి 22: వచ్చే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత కంపెనీలు మరింతమంది సిబ్బందిని నియమించుకోనున్నాయి. రాబోయే మూడు నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందంటూ 55 శాతం యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. మ్యాన్పవర్గ్రూప్ తన ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ 60వ వార్షిక ఎడిషన్ కోసం వివిధ రంగాలకు చెందిన 3,090 కంపెనీల యాజమాన్యాలతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 17 శాతం యాజమాన్యాలు వారి నియామకాలు తగ్గుతాయని పేర్కొనగా, ఎటువంటి మార్పూ ఉండదని 28 శాతం కంపెనీలు తెలిపాయి. దీంతో నికరంగా ఉపాధి 38 శాతం పెరుగుతున్నదని తెలుస్తున్నది.