న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీరులను రిక్రూట్ చేసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఇవాళ నోటిఫికేజన్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ర్యాలీలకు జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. దీనికి సంబంధించిన ప్రకటన ఇవాళ రిలీజ్ చేశారు. రక్షణశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేళ్ల కోసం సైనికుల్ని రిక్రూట్ చేయనున్న విషయం తెలిసిందే. అగ్నిపథ్ ద్వారానానే ఇండియన్ ఆర్మీలో సైనికులిగా చేరే అవకాశాలు ఉన్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. అగ్నివీరులకు చాలా విశిష్టమైన ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో చెప్పారు.
త్రివిధ దళాల్లో ఇండియన్ ఆర్మీ మొదటగా అగ్నివీర్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. అగ్నివీరులకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని, వాళ్లకు డీఏ, మిలిటరీ సర్వీస్ పే ఉండదని ఆర్మీ తెలిపింది. అందరి తరహాలోనే రేషన్, డ్రెస్, ట్రావెల్ అలోవెన్స్లు అగ్నివీర్ సైనికులకు అందుతాయి. నాలుగేళ్ల కాలానికి 48 లక్షల జీవిత బీమా వస్తుంది.
మహిళా నావికులు..
ఇక ఇండియన్ నేవీ కూడా ఓ కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా నేవీలోకి మహిళా నావికులను రిక్రూట్ చేయనున్నట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. శిక్షణ కాలం పూర్తి అయిన తర్వాత ఆ మహిళా నావికులకు యుద్ధ నౌకల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఆఫీర్స్ ర్యాంక్ కన్నా తక్కువ ఉన్న ర్యాంకుల్లోనూ మహిళలను రిక్రూట్ చేయనున్నారు.