వాషింగ్టన్: భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలువనున్నట్టు సంకేతాలిచ్చారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ‘అధ్యక్ష పదవికి పోటీ చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం అవసరమా? రెండోది, కొత్త లీడర్ తానేనా? అన్నది చూడాలి. అవును. ప్రస్తుతం కొత్త నాయకత్వం అవసరం. నేనే ఆ కొత్త లీడర్ కావొచ్చు’ అని ఆమె పేర్కొన్నారు. అధ్యక్షుడు బైడెన్కు మరో అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు.