IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో కీలకమైన మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. రాజ్కోట్(Rajkot)లో జరుగుతున్న ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్పై వేటు పడింది. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ డెబ్యూట్ చేయనున్నాడు. రంజీల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు.
గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, వైజాగ్ టెస్టులో ఆడని సిరాజ్లు జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. యంగ్ స్పిన్నర్ బషీర్ స్థానంలో మార్క్ వుడ్ ఆడుతున్నాడు.
భారత జట్టు : యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లే, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.