అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరగనున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియా జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. కేఎల్ రాహుల్, దీపక్ హూడా, చాహల్, శార్దూల్ను తుది జట్టుకు ఎంపిక చేయలేదు. వీరి స్థానంలో శ్రేయస్, కుల్దీప్, శిఖర్, దీపక్ చాహర్లను ఎంపిక చేశారు. రాహుల్కు గాయమైనట్లు తెలుస్తోంది. మూడవ వన్డేకు కూడా విండీస్ జట్టుకు పూరన్ సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఆ జట్టులో ఒక మార్పు జరిగింది. అకీల్ హుస్సేన్ స్థానంలో హేడన్ వాల్ష్ జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.