న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన కేసులు తాజాగా 30వేలకు దిగివచ్చాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా కొత్తగా 30,549 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,887 మంది బాధితులు కోలుకోగా.. మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,26,507కు పెరిగింది. ఇప్పటి వరకు 3,08,96,354 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మొత్తం 4,25,195 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టివ్ కేసులున్నాయని, టీకా డ్రైవ్లో మొత్తం 47,85,44,114 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.