న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో గరిష్ఠానికి చేరిన రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 1.72 కేసులు నమోదవగా, తాజాగా అవి 1.49 లక్షలకు తగ్గాయి. నిన్నటికంటే ఇవి 13 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో కొత్తగా 1,49,394 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,19,52,712కు చేరాయి. ఇందులో 4,00,17,088 మంది బాధితులు కోలుకోగా, 5,00,055 మంది మృతిచెందారు. మరో 14,35,569 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 1072 మంది బాధితులు మహమ్మారికి బలవగా, 2,46,674 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 168.47 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
నిన్న కేరళలో అత్యధికంగా కేరళలో 42,677 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 16,436, మహారాష్ట్ర 15,252, తమిళనాడు 11,993, రాజస్థాన్లో 8073 చొప్పున కేసులు నమోదయ్యాయి.