వాషింగ్టన్, నవంబర్ 18: రెమిటెన్స్లు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత్లోకి 87 బిలియన్ డాలర్ల విలువైన రెమిటెన్స్లు వచ్చాయని వరల్డ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. గతేడాది వచ్చిన రెమిటెన్స్తో పోలిస్తే ఇది 20 శాతం అధికమని పేర్కొంది. రెమిటెన్స్లు ఆకట్టుకోవడంలో భారత్ సరసన చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ దేశాలు ఉన్నాయని తెలిపింది. వచ్చే ఏడాది మరో మూడు శాతం పెరిగి 89.6 బిలయన్ డాలర్ల రెమిటెన్స్లు రావచ్చునని వాషింగ్టన్కు చెందిన బ్యాంక్ అంచనావేస్తున్నది. రెమిటెన్స్ల్లో అరబ్ దేశాల నుంచి భారత్కు అత్యధికంగా వస్తున్నాయని, ఆ తర్వాత అమెరికా నుంచి అని పేర్కొంది. 2020లో భారత్లోకి 83 బిలియన్ డాలర్ల విలువైన రెమిటెన్స్లు వచ్చాయి. విదేశాల్లో ఉన్న స్వదేశీయులు తమ బందువులకు పంపే నగదు రెమిటెన్స్గా వ్యవహరిస్తారు.