టరోబా: వరుస విజయాలతో అండర్-19 ప్రపంచకప్లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించిన యువభారత జట్టు.. చివరి లీగ్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. శనివారం రాత్రి ఉగాండాతో జరిగిన పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. రఘువంశీ (120 బంతుల్లో 144; 22 ఫోర్లు, 4 సిక్సర్లు), రాజ్ బవా (108 బంతుల్లో 162 నాటౌట్; 14 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ సెంచరీలతో కదం తొక్కారు. కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కెప్టెన్ యష్ ధుల్, వైస్కెప్టెన్, తెలుగు ఆటగాడు షేక్ రషీద్ అందుబాటులో లేకున్నా.. పరిమిత వనరులతోనే బరిలోకి దిగిన యువ భారత్ బ్యాటింగ్లో విజృంభించింది. టోర్నీ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై.. రెండో పోరులో ఐర్లాండ్పై సునాయాసంగా గెలుపొందిన.. టీమ్ఇండియా చివరి పోరులోనూ విజయంపై కన్నేసింది.