WTC Final 2023 :ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ నాలుగో రోజు.. రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు కష్టాల్లో పడింది. ధాటిగా ఆడుతున్నఓపెనర్ రోహిత్ శర్మ(43), ఛటేశ్వర్ పూజారా(27)తో వరస ఓవర్లలో ఔటయ్యారు. ముందుగా నాథన్ లియాన్ ఓవర్లో హిట్మ్యాన్ స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. కానీ, బంతి బ్యాట్కు తగల్లేదు. దాంతో, 92 రన్స్ వద్ద భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్, పూజారా రెండో వికెట్కు 51 పరుగులు జోడించారు. ఆ తర్వాత కమిన్స్ ఓవర్లో పూజారా షాట్ ఆడబోయి కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ() క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు స్కోర్.. 93/3. టీమిండియా విజయానికి 351 పరుగులు కావాలి.