న్యూఢిల్లీ: భారత్ డ్రోన్ మహోత్సవ్ను ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను డ్రోన్ల ద్వారానే ఆకస్మికంగా పర్యవేక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వ అధికారులతో ప్రగతి మీటింగ్ను ఏర్పాటు చేస్తానని, దాంట్లో డెవలప్మెంట్ పనులన్నీ డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ స్కీమ్లు సమర్థవంతంగా అమలు అయ్యే విధంగా టెక్నాలజీ ఉపకరిస్తోందన్నారు. రక్షణ రంగం, విపత్తు నిర్వహణలో డ్రోన్లను అధికంగా వాడనున్నట్లు మోదీ తెలిపారు. దేశంలో డ్రోన్ టెక్నాలజీ వ్యాపారం జోరుగా సాగుతోందని, భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన కూడా జరుగుతున్నట్లు మోదీ చెప్పారు. దేశంలో 2026 నాటికి డ్రోన్ పరిశ్రమ 15వేల కోట్ల టర్నోవర్ దాటుతుందని కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాథిత్య సింథియా తెలిపారు. ఇండియాలో ప్రస్తుతం 270 డ్రోన్ స్టార్టప్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. కొత్త డ్రోన్ రూల్స్ను అమలు చేస్తున్నామన్నారు.